గాంధీనగర్: రూ.86 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడ్డాయి. గుజరాత్లోని ద్వారకాలో బుధవారం ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని నుంచి 16 కిలోల మెఫెడ్రోన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గత అర్ధరాత్రి ప్రారంభమైన ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని రాజ్కోట్ రేంజ్ డీఐజీ సందీప్ సింగ్ తెలిపారు.
గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. పలు బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఒకరిని అరెస్టు చేయడంతోపాటు రూ.86 కోట్ల విలువైన డ్రగ్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మీడియాకు తెలిపారు.