వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఓ భక్తురాలు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నంచడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు..రాజన్న ఆలయ ఓపెన్ స్లాబ్లో సోమవారం గోదావరిఖని హనుమాన్ నగర్కు చెందిన పిట్టల రాధ అనే మహిళ చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.
క్యూ లైన్లోని భక్తులు గమనించి కేకలు వేయడంతో వెంటనే పోలీస్, ఆలయ అధికారులు స్పందించారు.సదరు మహిళను కాపాడి 108లో ఏరియా దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.