రంగారెడ్డి : జిల్లాలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. రెండు రోజుల క్రితం ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో మాడుగుల మండలం చంద్రాయన్ పల్లి గ్రామానికి చెందిన పోచమ్మ(39) అనే మహిళను కత్తులతో పొడిచి చంపిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో పోలీసులు నిందుతుడిని అరెస్ట్ చేశారు.
పోలీసుల కథనం మేరకు..చంద్రాయన్ పల్లికి చెందిన పోచమ్మ హైదరాబాద్లో స్వీపర్గా పనిచేస్తున్నది. చంద్రయాన్ పల్లి నుంచి ప్రతిరోజు హైదరాబాద్కు వెళ్లి వస్తుండేది. 14.9.2021 తేదీన డ్యూటీ ముగించుకొని అదే రోజు సాయంత్రం ఆమనగల్కు చేరుకొని తచంద్రాయన్ పల్లికి వెళ్లేందుకు ఆటో స్టాండ్ వద్ద వేచి ఉంది. అయితే గతంలో పరిచయం ఉన్న ఆమనగల్లో చికెన్ సెంటర్ నడుపుకునే సాకిబండ తండాకి చెందిన నేనావత్ జైపాల్ నాయక్ (30) అనే వ్యక్తి పోచమ్మను మాలేపల్లి గ్రామ శివారులోని ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడి చేసి డబ్బుల విషయంలో గొడవపడి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు.
ఎవరికీ అనుమానం రాకూడదని ఆమె ఆభరణాలు దొంగలించుకొని వెళ్లిపోయాడు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు జైపాల్ నాయక్ను గురువారం అరెస్టు చేశారు. మృతురాలి వద్ద నుంచి అతడు దొంగిలించిన ఆభరణాలు చెవి కమ్మలు, వెండి కడియాలు, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Road accident |యాదాద్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నిందితుడు రాజు చేతులపై పచ్చబొట్టు ఎవరిదో తెలుసా?
నా చుట్టూ డజన్ల సంఖ్యలో కరోనా సోకినవాళ్లే ఉన్నారు: వ్లాదిమిర్ పుతిన్
Nusrat Jahan: ఎట్టకేలకు తన బిడ్డ తండ్రి ఎవరో చెప్పిన అందాల నటి