కుత్బుల్లాపూర్, ఆగస్టు: ఫేస్బుక్లో ద్విచక్రవాహనం కొనుగోలుకు సిద్ధంగా ఉందని ప్రకటన చూసిన ఓ వ్యక్తి తన ఖాతా నుంచి డబ్బులు పంపి చివరకు మోసపోయాడు.పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ పద్మానగర్ ఫేస్-2 ప్రాంతానికి చెందిన జి.వెంకట రమణ (55) బైక్ను కోనుగోలు చేయాలని అనుకుంటుండగా ఇదే క్రమంలో ఈ నెల 8న తన ఫేస్బుక్లో టిఎస్07ఎఫ్ఎం6277 అనే నంబర్ గల ఆక్టివా అమ్మనున్నట్లు ఓ ప్రకటనను చూశాడు.
కాంటాక్ట్ నంబర్ తో చాటింగ్ లిస్ట్లో చూసి అతడికి ఫోన్ చేయగా తాను ఆర్మీ ఉద్యోగిని అని చెప్పి పరిచయం చేసుకొని బైక్ను కొరియర్ ద్వారా పంపిస్తానని కొన్ని నంబర్ల ద్వారా ఫోన్ చేసి పలు దఫాలుగా వివిధ ఛార్జీల పేరుతో డబ్బులు పంపామన్నాడు. అవతలి వ్యక్తి ప్రాసెసింగ్ ఫీజు కోసం ఇంకా చెల్లించాలని చెప్పడంతో అనుమానం రావడంతో తాను మోసపోయానని తెలుసుకొని స్థానిక పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.