వికారాబాద్ : చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి చెందిన సంఘటన గురువారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పూడూరు మండలం ఎన్కెపల్లి గ్రామానికి చెందిన యువకుడు కావలి అశోక్(24) వ్యవసాయ కూలీగా పని చేసేవాడు. ఈ నెల 20న పని ఉందని ఇంట్లో చెప్పి వికారాబాద్కు వచ్చాడు. పట్టణంలోనీ గరీబ్నగర్ రైల్వే పట్టాల వద్ద మనస్థాపంతో పురుగుల మందు తాగాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. దీంతో స్నేహితులు సంఘటన స్థలానికి చేరుకొని అశోక్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు.
హైదరాబాద్లోని ప్రైమ్ దవాఖానలో చికిత్సపొందుతూ ఈ నెల 22న రాత్రి మృతి చెందాడు. గురువారం మృతుడి తల్లి బీమమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై సురేశ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.