సూర్యాపేట: సూర్యాపేటలోని సద్దుల చెరువులో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చెరువులో వేరువేరు ప్రాంతాల్లో ఒక మహిళ, ఒక వ్యక్తి మృతదేహాలను గుర్తించారు. వాటిని బయటకు తీసుకొచ్చి ఆనవాలు పట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ ఇద్దరు కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా విడివిడిగా ఆత్మహత్య చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.