పోలీసుల్లా వేషం వేసుకున్న కొందరు దొంగలు ఒక మహిళను మోసం చేసి, ఆమె బంగారం దొంగిలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణేలో వెలుగు చూసింది. ఆమెను ఆపిన ఈ దొంగలు.. దగ్గరలో ఒక హత్య జరిగిందని చెప్పారు. ఈ కారణంగా ఎంక్వయిరీలు నిర్వహిస్తున్నామని చెప్పి, ఆమె నగలు మొత్తం తీయించారు.
వాటిని భద్రంగా పెడుతున్నామంటూ ప్లాస్టిక్ కవర్లో పెట్టారు. అంతే, వెంటనే ఆ బ్యాగు తీసుకొని పరుగు తీశారు. తాను మోసపోయానని తెలుసుకున్న ఆమె వారిని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
ఈ దొంగలు సదరు మహిళ నుంచి రూ.1.6 లక్షల విలువైన నగలను కాజేసినట్లు తెలుస్తోంది. ముగ్గురు దుండగులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.