నిజాబామాబాద్: నిజామాబాద్లోని ఇందల్వాయిలో చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న ఇండియన్ ఏటీఎంపై దొంగలు దాడి చేశారు. ఏటీఎంను ధ్వంసం చేసి రూ.11 లక్షలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. గ్యాస్ కట్టర్ సాయంతో ఏటీఎంను దొంగలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.