వనపర్తి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు..రాజపేట గ్రామానికి చెందినశేకుల ఆశోక్(24), ప్రకాష్ (20) గ్రామం నుంచి వనపర్తికి వస్తుండగా వనపర్తి నుంచి మహబుబ్ నగర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులు మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. మనకూ తప్పదా.. ఎందుకీ దుస్థితి?
Crime news : ట్రాక్టర్ బోల్తా..ఇద్దరికి తీవ్ర గాయాలు
T20 World Cup | ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్లో గెలుపెవరిది.. అఫ్రిది అంచనా ఇదీ!