వికారాబాద్: ప్రమాదవశాత్తూ చెరువు తూములో ఇరుక్కొని ఒక రైతు మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన వికారాబాద్లోని పట్టపహడ్ చెరువు వద్ద జరిగింది. అయితే తూములో ఇరుక్కున్న రైతు మృతదేహాన్ని బయటకు తీసేందుకు గ్రామస్థులెవరూ ముందుకురాలేదు.
ఈ విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయమే రైతు మృతి చెందినా అతని మృతదేహాన్ని ఎవరూ బయటకు తీసుకురాలేదు.
పరిస్థితిని అర్థం చేసుకున్న కుల్కచర్క ఎస్ఐ విఠల్ రెడ్డి తానే స్వయంగా చెరువులో దిగి రైతు మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. ప్రాణాలకు తెగించి ఎస్ఐ చూపిన తెగువను అందరూ అభినందిస్తున్నారు.