పరిగి టౌన్ : డీసీఎం వ్యానును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెంది, మరో మహిళకు గాయాలైన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లా మద్దూర్ మండలం మోమిన్పూర్ గ్రామానికి చెందిన కావలి శ్రీకాంత్, అతని తల్లి లక్ష్మి హైదరాబాద్ నుంచి టీఎస్12ఈకె2612 నంబర్ గల బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా నజీరాబాద్ గేట్ సమీపంలో ఆగిఉన్న డీసీఎం వ్యాను వెనుకాల నుంచి వచ్చి ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
చికిత్స నిమిత్తం పరిగి దవాఖానకు తరలించగా మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్కు రెఫర్ చేయడంతో శ్రీకాంత్ మార్గమధ్యలో మృతిచెందాడని ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విఠల్రెడ్డి తెలిపారు.