యాచారం : మండలంలోని వివిధ గ్రామాల్లో గుడుంబా తయారీదారులు, విక్రయదారులతో పాటు బెల్టుషాపులు నిర్వహిస్తున్న 20మందిని ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. మండలంలోని పలు తండాల్లో గుడుంబా తయారీ చేస్తూ, గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిస్తూ మద్యం విక్రయిస్తున్నవారిని ఎక్సైజ్ పోలీసులు గుర్తించి దాడులు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఎక్సైజ్ ఎస్ఐ యాదయ్య ఆధ్వర్యంలో 20మందిని తాసిల్దార్ నాగయ్య ఎదుట బైండోవర్ చేశారు. అక్రమంగా మద్యం విక్రయించినా, గుడుంబా తయారు చేసి విక్రయించినా దాడులు నిర్వహించి క్రిమినల్ కేసులను నమోదు చేస్తామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరించారు.