చేవెళ్ల రూరల్ : ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కార్లు ఒకదానికోకటి ఢీకొన్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టంపల్లి గేట్ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన వ్యక్తులు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి వెళ్తుండగా మార్గమధ్యలోని చిట్టంపల్లి గేట్ సమీపానికి రాగానే ముందు వెళ్తున్న కారు అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వేనుకనుంచి వస్తున్న ఐదు కార్లు ఒకదానికోకటి ఢీకొని 4కార్లు దెబ్బతినగా 5వ కారు పూర్తిగా ముందు భాగం, వెనుకభాగం నుజ్జునుజ్జయింది.
ఈ ఘటనలో పలువురికి స్వల్పగాయాలు కావడంతో స్థానికులు దవాఖానకు తరలించారు. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్లపై ఉన్న కార్లను తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కార్లలో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది.