హయత్నగర్ రూరల్ : ఔటర్ రింగురోడ్డుపై శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని కారు అతివేగంగా వెనుక నుంచి ఢీకొట్టడంతో రెండు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. సిమెంట్ లోడుతో సూర్యాపేట నుంచి ఘట్కేసర్ వైపు వెళ్తున్న లారీని ఓఆర్ఆర్ పెద్ద అంబర్పేట టోల్ప్లాజా దాటాక బలిజగూడ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారుతో పాటు లారీలో మంటలు చెలరేగాయి. కారు డ్రైవర్ మయూర్కు స్వల్పగాయాలు కాగా, అతన్ని వెంటనే దవాఖానకు తరలించినట్టు అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు తెలిపారు. అగ్నిమాపకశాఖకు సమాచారం ఇవ్వగా.. వారు వచ్చి ఫైర్ ఇంజిన్తో మంటలను ఆర్పివేశారు.
కారు డైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. రెండు వాహనాలకు నష్టం జరిగిందని తెలిపారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ఘటన స్థలిలో ఉన్న తోటి వాహనదారులు ఆరోపించారు.