జైపూర్ : వివాహేతర సంబంధంపై అనుమానంతో కలప, వుడ్ ఫ్యాక్టరీ కాంట్రాక్టర్ (50)ను కడతేర్చిన ముగ్గురు నిందితులను జైపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు మహేష్ తన భార్యతో బాధితుడు వివాహేతర సంబంధం నడుపుతున్నాడనే అనుమానంతో హత్యకు ప్లాన్ చేశాడు. బాధితుడు భేరా రాం దేవసి మృతదేహం జైపూర్ డివిజన్లోని శివదాస్పుర ప్రాంతంలో ఆదివారం ఉదయం లభ్యం కావడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
బాధితుడు, నిందితుడు ఇద్దరూ ఫ్యాక్టరీ కాంపౌండ్లోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీ లోపల తన భార్య, కాంట్రాక్టర్ దేవసితో కలిసి ఉండటాన్ని పసిగట్టిన మహేష్ వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానించాడు. ఇదే విషయమై భార్యను నిలదీయగా అలాంటిదేమీ లేదని తోసిపుచ్చింది.
అయినా ఇద్దరి మధ్య సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్న మహేష్ ఎలాగైనా దేవసిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. శనివారం రాత్రి తన స్నేహితులు మరో ఇద్దరితో కలిసి మద్యం సేవించిన మహేష్ గాఢనిద్రలో ఉన్న దేవసిపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. బాధితుడు మరణించగా నిందితులు ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులనూ అరెస్ట్ చేశారు.