బండ్లగూడ : భర్త వేదింపులు భరించ లేక మహిళ అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం…రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎం పహాడ్కు చెందిన మహ్మద్సాజిద్ సబీనా బేగం దంపతులు తమ ఐదు మంది పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. సాజిద్ టెంట్ హౌజ్లో పని చేస్తూ మద్యానికి భానిసై భార్య పిల్లలను వేదిస్తున్నాడు. దీంతో భార్య సబీనా బేగం (35) బుధవారం మద్యాహ్నాం పురుగుల మందు సేవించి అత్మహత్యకు పాల్పడింది.
కాగా పిల్లలు ఆస్పత్రికి తరలించాలని తండ్రి సాజిద్ను కోరినా వినకుండా వారిని మరోక గదిలో బందించాడు. సబీనా అక్కడికక్కడే మృతి చెందింది. సాయంత్రం సమయంలో పిల్లల అరుపులు విని స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా అమె మృతి చెంది ఉంది. స్థానికులు ఇచ్చిన పిర్యాదుతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.