హైదరాబాద్ : నగరంలోని పేట్ బషీరాబాద్లో పసికందు మొండెం లభ్యమైంది. దత్తాత్రేయ నగర్లోని ఓ చెత్త కుప్ప వద్ద శిశువు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పసికందు మొండెంను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే శిశువు రెండు కాళ్లు, ఒక చేతి మాయం అయ్యాయి. ఆ నవజాత శిశువును కుక్కలు పీక్కుతిన్న ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే శిశువును ఎవరైనా అక్కడ వదిలి వెళ్లిపోయారా? లేక కుక్కలు లాక్కొచ్చాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.