మన్సూరాబాద్ : బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును అపహరించుకుపోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సీఐ అశోక్రెడ్డి కథనం ప్రకారం.. ఎల్బీనగర్, శివగంగాకాలనీ, సాయిరాం డ్రీమ్స్ అపార్ట్మెంట్కు చెందిన మారెడ్డి సునీతారెడ్డి (53) ప్రైవేటు టీచర్గా పని చేస్తుంది. జనప్రియకాలనీలో నివాసముండే బంధువుల ఇంటికి వెళ్లిన ఆమె గురువారం రాత్రి 7 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుంది.
శివగంగాకాలనీలోని సత్యసాయి హైట్స్ సమీపంలోకి రాగానే ఒంటరిగా వస్తున్న ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు పుస్తెలతాడును బైకుపై వచ్చిన ఇద్దరు అగంతకులు లాక్కొని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.