హైదరాబాద్ : సికింద్రాబాద్ పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో వరుస చోరీలు జరిగాయి. గంట వ్యవధిలోనే మూడు చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. బాధిత మహిళలు పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చైన్ స్నాచింగ్ జరిగిన ఏరియాల్లో ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాలనీల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులపై పోలీసులకు తక్షణమే సమాచారం అందించాలని పోలీసులు మహిళలకు సూచించారు.