–మద్యం సేవించి నిర్లక్ష్యంగా నడపడంతో గుంతలో పడిన కారు
-గాయాలతో బయటపడిన యువకులు
మాదాపూర్ : మద్యం సేవించి కారును నిర్లక్ష్యంతో వేగంగా నడపడంతో కారు గుంతలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులకు గాయాలు కాగా కారు ధ్వంసమైంది. ఈ సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గచ్చిబౌలిలోని ఓ బార్లో మద్యం సేవించిన ముగ్గురు యువకులు గచ్చిబౌలి నుండి మాదాపూర్కు కియా కారులో వస్తుండగా దుర్గం చెరువు సమీపంలోని రోడ్డుకు ఆనుకొని ఉన్నటువంటి ఓ గుంతలో పడి కారు ధ్వంసమైంది. దీంతో స్థానికుల సమాచారంతో హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కారులోని వ్యక్తులను సమీపంలోని దవాఖానాకు తరలించారు. వైద్య సిబ్బంది వారికి చికిత్స అందించగా సోమవారం డిశ్చార్జి అయినట్లు సమాచారం.