ఖమ్మం : ఖమ్మం నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం టూటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఎన్ఎస్టీ రోడ్డులో పల్సర్ వాహనంపై ముగ్గురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా పెట్రోలింగ్ పోలీస్ వాహనాన్ని చూసి పరారయ్యేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంబడించి నిందితులను పట్టుకున్నారు. నిందితుల నుంచి 3.5 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న ఎండీ ఫయాజ్, గుగులోత్ భద్రు, ప్రభాకర్ అనే వ్యక్తులను అరెస్టు చేసి న్యాయస్ధానానికి తరలించినట్లు పేర్కొన్నారు.