భద్రాచలం: జిల్లా పోలీసు, ఎక్సైజ్ అధికారులు మత్తుపదార్థాల విక్రయాలను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. అందులోభాగంగానే పట్టణంలోని బస్టాండ్, అంబేద్కర్ సెంటర్, గోదావరి బ్రిడ్జి, డిగ్రీ కళాశాల పరిసర ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్లో అనుమానస్పదంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద 75కేజీలగంజాయి లభించిందని ఎక్సైజ్ సీఐ సర్వేశ్వర్ తెలిపారు. దీని విలువ రూ. 7.50లక్షలు ఉంటుందని, పట్టుబడ్డ నిందితులు బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించడం జరిగిందన్నారు. నిందితులను భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించనున్నట్లు ఆయన తెలిపారు.