నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. డిచ్పల్లి మండలం బర్దిపూర్ శివారు కేశాపూర్ రోడ్డు సమీపంలో అబ్దుల్ మజీద్ (33) అనే యువకుడు హత్యకు గురయ్యాడు.
మృతుడు జిల్లా కేంద్రంలోని నాగారం గోశాల రోడ్ ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు తెలిపారు. పాత కక్షలే హత్యకు కారణాలుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.