దుండిగల్: మూర్చ వ్యాధితో బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ రాజీవ్గృహకల్పలో బూస రాజ్కుమార్, రుక్మిణి దంపతులు నివాసముంటున్నారు. రాజ్కుమార్ ప్రైవేట్ సెక్యూరిగార్డుగా పనిచేస్తుండగా రుక్మిణి గృహిణి. వీరికి కొడుకు వెంకటేష్(17) ఉన్నాడు. గతకొంత కాలంగా వెంకటేష్ మూర్చ వ్యాధితో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో రాజ్కుమార్ నైట్డ్యూటీకి వెళ్లగా రాత్రి భోజనఅనంతరం తల్లికొడుకుల ఇంట్లో నిద్రపోయారు. వెంకటేష్ నిద్ర లేవకపోవడంతో ఆందోళనకు గురైన రుక్మిణి రోధిస్తూ విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. దీంతో వెంటనే రుక్మిణి తన కొడుకును షాపూర్నగర్లోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా వారు వేరే వైద్యశాలకు తీసుకువెళ్లాలని సూచించారు. వెంకటేష్ను సనత్నగర్లోని ఈఎస్ఐ వైద్యశాలకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. రాజ్కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.