ముంబై : గత కొద్దినెలలుగా దేశవ్యాప్తంగా ఆన్లైన్ స్కామ్లు విపరీతంగా పెరిగాయి. రోజుకో తరహా స్కామ్తో సైబర్ నేరగాళ్లు (Cyber Fraud) చెలరేగుతూ ఆన్లైన్ వేదికగా అడ్డగోలుగా అమాయాకులను మోసం చేస్తున్నారు. లేటెస్ట్గా పుణేకు చెందిన ఓ బ్యాంక్ మేనేజర్ను బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు అతడిని రూ. 15 లక్షలకు మోసం చేశారు. ఆన్లైన్ టాస్క్లతో అదనంగా ఆర్జించవచ్చని సైబర్ నేరగాళ్లు మభ్యపెట్టగా అందుకు సమ్మతించిన బ్యాంక్ మేనేజర్ ఏకంగా 27 టాస్క్లను పూర్తి చేశాడు. తొలుత ఆయన నమ్మకాన్ని చూరగొనేందుకు కొంత డబ్బు చెల్లించారు.
ఆపై టాస్క్ యాక్టివేషన్ ఫీజు పేరుతో స్కామర్లు ఆయన నుంచి భారీగా దండుకున్నారు. బాధితుడి నుంచి మొత్తం రూ. 15 లక్షలు వసూలు చేశారు. తొలుత స్కామర్లు పార్ట్టైం జాబ్ ఆఫర్ చేస్తామంటూ బాధితుడిని సంప్రదించారు. ఇంటి నుంచి పనిచేస్తూ పెద్దమొత్తంలో ఆర్జించవ్చని నమ్మబలికారు. తొలుత కొన్ని టాస్క్లకు డబ్బు చెల్లించిన స్కామర్లు ఆపై నిర్ధిష్ట టాస్క్లను యాక్టివేట్ చేసుకోవాలని, దీనిపై మెరుగైన రిటన్స్ వస్తాయని నమ్మబలికారు. ముందుగా కొన్ని టాస్క్లు పూర్తిచేసిన తర్వాత బాధితుడికి కొద్దిమొత్తంలో నగదు పంపారు.
బాధితుడు అనంతరం పలు టాస్క్ల యాక్టివేషన్ కోసం నగదు బదలాయించాడు. మొత్తం 27 టాస్క్లు పూర్తయిన క్రమంలో అతడు తన లాభాలను విత్డ్రా చేసేందుకు ప్రయత్నించగా మరో మూడు టాస్క్లు పూర్తిచేయాలని స్కామర్లు చెప్పుకొచ్చారు. ఆయా టాస్క్లు యాక్టివేట్ అయ్యేందుకు రూ. 20 లక్షలు డిపాజిట్ చేయాలని కోరారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
Read More :