బోనకల్లు: సైబర్నేరాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని బోనకల్లు ఎస్సై టీ.కవిత అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ లింగమనేని నళిని అధ్యక్షతన సైబర్నేరాల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ సైబర్నేరాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయని, విద్యార్థులు స్మార్ట్ఫోన్ వాడుతూ ఫేస్బుక్, వాట్సాప్, ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారన్నారు. అటువంటి సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.