నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎడపల్లి మండలంలోని ఈఆర్పీ క్యాంప్ గ్రామంలో సోమవారం ఉదయం తల్లిని ఆమె కుమారుడు రోకలి బండ రాయితో తలపై కొట్టి చంపాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కొమరవ్వ (52) అనే మహిళను ఆమె కుమారుడు శ్రీనివాస్ రోకలి బండ రాయితో తలపై బాదాడు.
దీంతో ఆమెకు తీవ్ర రక్త స్రావం కాగా చికిత్సల నిమిత్తం బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని జిల్లా ప్రభుత్వ దవాఖానకు రెఫర్ చేశారు. కాగా, ఆమెను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది.
శ్రీనివాస్ మానసిక పరిస్థితి సరిగా లేని కారణంగా ఈ సంఘటన జరిగి ఉంటుందని గ్రామస్తులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
డీసీపీ కార్యాలయ సిబ్బంది ఔదార్యం..వృద్ధురాలికి చేయూత
Ind vs Eng | ఇంగ్లండ్ గెలుస్తుందా? చేజింగ్లో ఆ టీమ్ రికార్డేంటి? ఓవల్ పిచ్ ఎలా ఉంది?
కందకుర్తి వద్ద ఉధృతంగా గోదావరి ప్రవాహం