అమరావతి : ఏపీలోని నెల్లూరు(Nellore District) జిల్లాలో దారుణం జరిగింది. భూ తగాదాలతో దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని మర్రిపాడు మండలం భీమవరంలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గత కొన్నేళ్లు రెండు కుటుంబాల మధ్య భూ వివాదాం జరుగుతుంది. గురువారం భూమి రీసర్వే చేస్తుండగా మరోసారి వివాదం జరుగడంతో రామరత్నారెడ్డి అనే వ్యక్తిని ట్రాక్టర్తో తొక్కించడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనలో మహిళతో పాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే విక్రమ్రెడ్డి ఆత్మకూరు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని శవ పంచనామ నిర్వహించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.