వరంగల్ లీగల్ : ఎనిమిదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష, నాలుగువేల జరిమానా విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే..జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన నిందితుడు తోడేటి రమేష్ తేది 12 -10-2018న పొరుగున ఉండే 8 సంవత్సరాల బాలికను గుట్కా తెమ్మని కిరాణా షాప్కి పంపించాడు.
గుట్కా తీసుకువచ్చిన సదరు బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జరిగిన విషయాన్ని బాధిత బాలిక కుటుంబ సభ్యులకు తెలపడంతో వారి ఫిర్యాదు మేరకు నిందితులపై అత్యాచార కేసు నమోదు చేసిన ఘణపురం పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించారు.
బాధిత బాలిక సాక్ష్యంతో పాటు ఇతర సాక్ష్యాలు పరిశీలించిన న్యాయమూర్తి నిందితులకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ కేసును అప్పటి సబ్ డివిజినల్ పోలీస్ అధికారి విజయ సారథి దర్యాప్తు చేయగా కోర్టు డ్యూటీ ఆఫీసర్ వి.రవీందర్ సాక్షులను ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీహెచ్ సత్యనారాయణ వాదించారు.
ఇవి కూడా చదవండి..
వివాహితతో ఎస్ఐ రాసలీలలు..రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భర్త
భూ వివాదంతో దళిత కుటుంబం హత్య.. బాలికపై సామూహిక లైంగికదాడి
40 రోజుల పసికందును చంపిన అత్యాచార బాధితురాలు