వరంగల్ అర్బన్ : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను వేలేరు పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన చైన్ స్నాచర్ల నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువగల 75 గ్రాముల మూడు బంగారు పుస్తెల తాడులతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి మీడియాకు వివరాలను వెల్లడించారు. పుల్లూరి రాజేష్, బత్తుల రాజు నిందితులు ఇద్దరు ఒకే కళాశాలో డిగ్రీ కల్సి చదవడం ద్వారా ఇద్దరి మధ్య స్నేహం కుదరిందన్నారు. వీరిలో ఎంబీఏ చేసిన రాజేష్ పాన్షాపు నిర్వహిస్తుండగా, మరో నిందితుడు మెడికల్ రిప్రజెంటివ్ పనిచేస్తున్నారు.
జల్సాలకు అలవాటు పడ్డ వీరు అదాయం సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ప్రణాళికను రూపొందించుకున్నారు. ఇందుకోసం ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని మహిళల మెడలోని బంగారు గోలుసులను చోరీ చేసేందుకు సిద్ధపడ్డారు. ధర్మసాగర్ ఇన్ స్పెక్టర్ అదేశాల మేరకు వేలేరు ఎస్.ఐ వెంకటేశ్వర్లు, ప్రొబేషనరీ ఎస్.ఐ హఫీజా తమ సిబ్బందితో కలిసి వేలేరు పీచర క్రాస్ రోడ్డు వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిందితులు తనీఖీలు నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు.
పోలీసులు వెంబడించి పట్టుకొని తనీఖీ చేయగా నిందితుల వద్ద మూడు బంగారు పుస్తెల తాళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీపీ తెలిపారు. నిందితులు పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను అభినందించారు.
ఇవి కూడా చదవండి..
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
Tokyo Olympics: ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా స్విమ్మర్