భోపాల్ : ఫోన్ కోసం అత్తతో గొడవ పడిన ఓ కోడలు.. తీవ్ర మనస్తాపానికి గురై తన ఇద్దరు పిల్లల్ని బావిలో తోసి తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ఛత్తర్పూర్లో ఆదివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
33 ఏండ్ల ఓ మహిళకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఒకరి వయసు 10 ఏండ్లు కాగా, మరొకరి వయసు 4 ఏండ్లు మాత్రమే. అయితే ఫోన్ విషయంలో అత్తకు, కోడలి మధ్య శనివారం రాత్రి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆదివారం తమ పశువులను తీసుకొని కోడలు పొలం వద్దకు వెళ్లింది. తీవ్ర మనస్తాపానికి గురైన కోడలు.. తన ఇద్దరు పిల్లలలో బావిలో పడేసి చెట్టుకు ఉరేసుకుంది. నాలుగేండ్ల కూతురు ప్రాణాలతో బయటపడగా, పెద్ద కూతురు, తల్లి చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.