రంగారెడ్డి : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ బైక్ను ఢీ కొట్టడంతో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మృతురాలు కూకట్పల్లి చెందిన రమ్యప్రసన్నగా గుర్తించారు. యువతీ యువకుడు సంగి టెంపుల్కు వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. వీరిద్దరు ప్రేమ జంటని పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.