అమీన్పూర్,ఆగస్టు 11 : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మహిళను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన అమీన్పూర్ పోలీసుస్టేషన్ పరిధిలో గురువారంచోటుచేసుకుంది. ఎస్ఐ కిష్టారెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన రేణుక ( 30) ఓఆర్ఆర్ పై రహదారి మరమ్మతుల పనికోసం కాంట్రాక్టర్ వద్ద పని కుదుర్చుకుంది. కాగా, గురువారం ఉదయం సుల్తాన్పూర్ అవుటర్రింగ్ రోడ్డుపై మరమ్మతులు చేస్తున్న సమయంలో కారు అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి రేణుకను ఢీకొట్టింది. దీంతో రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.