నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గంజాయి అమ్మొద్దని చెప్పినందుకు ఓ యువకుడిపై రౌడీ షీటర్ కత్తితో పొడిచాడు. ఈ సంఘటన బాబాన్ సాహబ్ పహడ్ వద్ద ఉన్న మహబూబియా పంక్షన్ హల్ వద్ద చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు..ఇబ్బు అనే పాత నేరస్తుడు నాగారంకు చెందిన ఒక యువకుడుతో కలిసి అబ్బాస్ అనే యువకుడిని కత్తితో పొడిచాడు. స్థానికులు అబ్బాస్ను ఆటోలో జిల్లా జనరల్ దవాఖానకు తరలించారు. కాగా, ఇబ్బుపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Nallagonda |చిట్యాల వద్ద భారీగా నగదు పట్టివేత
Actress molested : విమానంలో నటిని వేధించిన వ్యాపారవేత్త అరెస్ట్
రైతన్న సినిమాను విజయవంతం చేయాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి