AP News | అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పెనుగంచిప్రోలు మండల పరిధిలోని ముండ్లపాడు రోడ్డు వద్ద హైవేపై దూసుకెళ్తున్న కారు.. అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపు చేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నందిగామ డీఎస్పీ జనార్ధన్ నాయుడు తెలిపారు.
#WATCH | Telangana: A person died and two others were injured in an accident where a car crashed into the divider on the Penuganchiprolu Mandal Mundlapadu road. Fire broke out in the car after it crashed. Fire tenders are on the spot to douse the fire: Nandigama DSP, Janardhan… pic.twitter.com/zCgrabRZGP
— ANI (@ANI) December 22, 2023