అమరావతి : అనంతపురం( Ananthapuram) జిల్లాకూడేరు మండలం గొడ్కూరులో విషాదం చోటు చేసుకుంది . ప్రైవేట్ వెంచర్లో స్వాగత ముఖద్వారం కూలి ఇద్దరు కూలీలు(Labours) అక్కడికక్కడే మృతి చెందారు. ఛత్తీస్గఢ్(Chhattisgarh) కు చెందిన పూరన్సింగ్, హాస, మరో కూలి నిర్మాణపనులు చేస్తుండగా శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో వారు కిందపడి తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామ చేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.