వరంగల్ : సంగెం మండలం ఎల్గూరు రైల్వే స్టేషన్ సమీపంలో వేగంగా వెళ్తున్న రైల్లో నుంచి ఓ ప్రయాణికుడు జారిపడ్డాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 398/21 పోల్ వద్ద పని చేస్తున్న రైల్వే సిబ్బంది సాంబయ్య, గాయపడ్డ ప్రయాణికుడిని గుర్తించి పోలీసులకు, 108 అంబులెన్స్కు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న అంబులెన్స్.. ప్రయాణికుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.