హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ అయిన బాలుడి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాప్ అయిన గంట వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. ఏడాది బాలుడిని అపహరించగా, అతని తల్లిదండ్రులు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్టేషన్ పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, బాలుడి ఆచూకీని కనుగొన్నారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మరియమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.