కొండాపూర్ : ఆనందంగా పెండ్లి చేసుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరుడు అక్కడికక్కడే మృతి చెందగా వధువు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాధ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
శేరిలింగంపల్లి నేతాజీనగర్కు చెందిన అన్నపూర్ణ, మురళీకృష్ణల కుమారుడు శ్రీనివాసులు చెన్నైకి చెందిన కనిమొళిని నవంబర్ 21 న తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. వివాహ అనంతరం శ్రీనివాసులు కనిమొళితో కలిసి సోమవారం కారులో చెన్నై బయలుదేరారు.
సోమవారం అర్ధరాత్రి చెన్నై కందికుప్పం పోలీసు స్టేషన్ పరిధిలోని కృష్ణగిరి ప్రభుత్వ దవాఖాన సమీపంలో రోడ్డుపై ఆగిఉన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టడంతో శ్రీనివాసులు అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కనిమొళి చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పెళ్ళైన మూడు రోజుల్లోనే వధూవరులు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.