Murder Case | నాగర్కర్నూల్ : కల్వకుర్తిలో ఇటీవల చోటు చేసుకున్న వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. కల్వకుర్తి పట్టణంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో రెండు హత్యలు వెలుగులోకి వచ్చాయి.
వృద్ధురాలితో పాటు మరొకరిని హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను కల్వకుర్తికి చెందిన వాసి వెంకటేశ్, తెలకపల్లి మండలం వట్టిపల్లికి చెందిన అలివేలుగా పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ. 4 లక్షల విలువైన బంగారు, వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను పోలీసులు రిమాండ్కు తరలించారు.