జగిత్యాల: జిల్లాలోని పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక జన్మదిన వేడుకల్లో యువకులు కత్తులతో హంగామా చేశారు. ఈ ఘటనపై 14 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎల్లాపూర్ బస్టాండు వద్ద రోడ్డుపై వేణు అనే యువకుడి జన్మదినం సందర్భంగా యువకులు కత్తులు (తల్వార్) పట్టుకుని తిప్పారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించి, రోడ్డుపై ఎక్కువ మొత్తంలో జనం కలిసి హంగామా చేయడంతో ఇందులో పాల్గొన్న 14 మందిపై చట్ట పరంగా కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తీగల అశోక్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
నల్లగొండ జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్
ఘరానా దొంగను అరెస్ట్ చేసిన కోరుట్ల పోలీసులు
బాల్య వివాహాల నిర్మూలనే లక్ష్యం : మంత్రి సత్యవతి
రైతులకు, హమాలీలకు ఉచిత అన్నదానం : ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి ఎర్రబెల్లి
పేదలకు అండగా తెలంగాణ ప్రభుత్వం