హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా షార్జా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు ఐఫోన్లను స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రూ. 8.37 లక్షల విలువ చేసే 9 ఐఫోన్లను( iPhone 13 Pro ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐఫోన్లను స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణికుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.