నెల్లూరు: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ టెంపో ఢీకొట్టింది. దీంతో ఎనిమిది మంది మరణించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి టెంపో ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మృతులంతా తమిళనాడులోని చెన్నైకి చెందినవారిగా గుర్తించారు. శ్రీశైలం నుంచి నెల్లూరు వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. టెంపో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఎయిర్ ఇండియాలో వంద శాతం పెట్టుబడులు వెనక్కి: హర్దీప్ సింగ్
ఏప్రిల్ 1 నుంచి అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ షురూ!
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్