రాత్రిపూట తన పొలంలో పడుకొని ఉన్నాడా 70 ఏళ్ల వృద్ధుడు. అలాంటి సమయంలో అక్కడకు వచ్చిన కొందరు బండరాయితో అతని తల పగలగొట్టేశారు. ఈ ఘటన రాజస్థాన్లోని కోటా ప్రాంతంలో వెలుగు చూసింది. కన్హీ అలియాస్ కన్హయలాల్ మీనా అనే 70 ఏళ్ల వృద్ధుడు కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఖేర్ఖేడా గ్రామంలోని తన పొలంలో ఉంటున్నాడు. అతను అక్కడ ఉండగానే ఎవరో కన్హయలాల్ను హత్య చేయడం జరిగింది. అతని తలకు బలమైన గాయం తగలడం వల్లే మరణం సంభవించిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో బండరాయితో అతని తల పగలగొట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అతనికి దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 10-12 మంది గ్రామస్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు జరుగుతోందని, త్వరలోనే హంతకులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.