హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఇద్దరు ప్రయాణికుల నుంచి 478 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 25 లక్షల విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ ఇద్దరు ప్రయాణికుల్లో ఒకరు కువైట్ నుంచి రాగా, మరొకరు దుబాయి నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరిని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.