Accident | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నో (Lucknow) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. స్కూటీ ( scooty ) ని ఢీ కొట్టిన స్కార్పియో వాహనం (Scorpio car) అలాగే 100 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఓ ఎస్యూవీ కారు (SUV car) స్కూటీ ( scooty ) ని బలంగా ఢీ కొట్టి అలాగే 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు కింద ఓ కుటుంబం ఇరుక్కుపోయింది. అనంతరం కారు ఓ చెట్టును ఢీ కొట్టి ఆగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారు కింద ఇరుక్కుపోయినవారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్కూటీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా మృతులు సీతాపూర్కు చెందిన రామ్సింగ్ (35), అతని భార్య, ఇద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వారు వెల్లడించారు.
Also Read..
Kushi | టర్కీలో ‘ఖుషీ.. ఖుషీ’గా సమంత – విజయ్ దేవరకొండ.. పిక్స్ వైరల్
MP Avinash Reddy | వైఎస్ వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్