బెంగళూర్ : ఎన్సీబీ అధికారులు బెంగళూర్లో భారీ ఆపరేషన్ చేపట్టి లెహెంగాల్లో దాచిన రూ కోట్ల విలువైన మూడు కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు లెహెంగాల్లో దాచిన డ్రగ్స్ను అధికారుల కండ్లు కప్పి ఆస్ట్రేలియా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఎన్సీబీ భగ్నం చేసింది. డ్రగ్స్ అక్రమ రవాణాపై సమాచారం అందడంతో అక్టోబర్ 21న ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ (బెంగళూర్) అమిత్ గవాటె నేతృత్వంలోని బృందం మూడు కిలోల మత్తుపదార్ధాలతో కూడిన పార్శిల్ను సీజ్ చేసింది.
పార్శిల్లో మూడు లెహెంగాల్లో డ్రగ్స్ను దాచినట్టు వెల్లడైంది. ఏపీలోని నరసాపురంలో బుక్ చేసిన ఈ పార్సిల్ను ఆస్ట్రేలియాకు పంపుతున్నట్టు వెల్లడైంది. షిప్మెంట్ను ట్రాక్ చేయగా పార్సిల్ పంపిన వ్యక్తి అడ్రస్ చెన్నైలో ఉన్నట్టు గుర్తించారు. ఎన్సీబీ అధికారులు శుక్రవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్తో కూడిన పార్సిల్ను పంపేందుకు నిందితుడు నకిలీ పత్రాలను వాడినట్టు అధికారులు తెలిపారు.