వరంగల్ : గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను వరంగల్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఒడిశాకు చెందిన భిషోయ్, కామిని నాయక్, దాముని నాయక్తో పాటు రాజేశ్ కుమార్(బీహార్)ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి రూ. 6.30 లక్షల విలువ చేసే 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
భిషోయ్, కామిని నాయక్ను వరంగల్ రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్టు చేయగా, మరో ఇద్దరిని ఎంహెచ్ఎం హాస్పిటల్ సెంటర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలో గంజాయిని విక్రయించిన వీరు.. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు రైళ్లలో రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.