వికారాబాద్ : కొడంగల్ మండల కేంద్రానికి సమీపంలోని నీటూరు గేటు వద్ద మంగళవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మృతుడిని నాగారం వాసి అహ్మద్ గా పోలీసులు గుర్తించారు.
అయితే వాహనదారులు తమ బైక్లను ఆపి రోడ్డుప్రమాద ఘటనను పరిశీలిస్తుండగా మరో ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆపి ఉన్న బైక్లను లారీ ఢీకొట్టింది. ఈ లారీని మరో లారీ ఢీకొట్టగా.. డ్రైవర్ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో నాలుగు బైక్లు ధ్వంసమయ్యాయి. ఈ రెండు ప్రమాద ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.