జయశంకర్ భూపాలపల్లి : జిల్లా పరిధిలోని గణపురం మండలం సింగరేణి క్వార్టర్స్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జేసీబీ సహాయంతో సింగరేణి రెస్క్యూ టీం ట్రాక్టర్ను తొలగించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను భూపాలపల్లి మండలం గొర్లవిడు తండాకు చెందిన భూక్య రాజేందర్ (27), రామ్చరణ్ (20)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.